అక్కినేని ప్రిన్స్ అఖిల్ తన తర్వాత చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెల్సిందే.మొదటి చిత్రంతో నిరాశ పర్చిన అఖిల్ రెండవ సినిమాకు ఛాన్స్ తీసుకోవాలని భావించడం లేదు.
ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కొట్టి తీరాలనే పట్టుదలతో అఖిల్ ఉన్నాడు.అందుకే దర్శకుడిని ఏరి కోరి ఎంపిక చేసుకోవడం జరిగింది.
‘ఊపిరి’ సక్సెస్తో జోష్ మీదున్న వంశీ ఒక మంచి మాస్ మసాలా చిత్రాన్ని అఖిల్ హీరోగా తెరకెక్కిస్తాడని అంతా అనుకుంటున్న సమయంలో ఒక బాలీవుడ్ చిత్రాన్ని వీరు రీమేక్ చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి
బాలీవుడ్లో విడుదలై సక్సెస్ సాధించిన ‘యే జవానీ హై దివానీ’ చిత్రానికి రీమేక్గా అఖిల్ చిత్రం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.వంశీ ఇటీవల విడుదలైన ‘ఊపిరి’ చిత్రాన్ని కూడా ఒక ఫ్రెంచ్ చిత్రానికి రీమేక్గా తెరకెక్కించిన విషయం తెల్సిందే.
రీమేక్కు సరైన న్యాయం చేయడం వల్లే మరోసారి రీమేక్ బాధ్యతను వంశీకి అప్పగిస్తే బాగుంటుందనే నమ్మకంతో అఖిల్ అండ్ టీం ఉన్నట్లుగా తెలుస్తోంది.హిందీలో రణబీర్ కపూర్, దీపికా పదకునే ప్రధాన పాత్రల్లో నటించిన ఆ చిత్రంలో అఖిల్ నటిస్తే విజయం సాధించడం ఖాయం అని సినీ ప్రముఖులు సైతం అంటున్నారు.
మరి ఈ రీమేక్కే అఖిల్ ఫిక్స్ అవుతాడా అనేది చూడాలి.