బిగ్ బాస్ సీజన్ 4 గ్రాంఢ్ ఫినాలే ఎపిసోడ్ లో టాప్ 3 కంటెస్టెంట్లలో అభిజిత్, అఖిల్, సోహైల్ నిలవగా సొహైల్ 25 లక్షలు తీసుకుని గేమ్ నుంచి క్విట్ కావడం, అభిజిత్ 25 లక్షలతో పాటు టైటిల్ గెలవడంతో రన్నర్ అయినా అఖిల్ బకరా అయ్యాడంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కొందరు నెటిజన్లు అభిజిత్, అరియానా, సోహైల్ టాప్ 3లో ఉంటారని భావించామని ఊహించని విధంగా అఖిల్ టాప్ 3లో ఉన్నాడని అభిప్రాయపడుతున్నారు.
ఒకవేళ సోహైల్ గేమ్ నుంచి క్విట్ కాకపోతే అభిజిత్ విన్నర్, సోహైల్ రన్నర్ అయ్యేవాడని చెబుతున్నారు.అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత అఖిల్ లైవ్ లోకి వచ్చి బిగ్ బాస్ షో గురించి, ట్రోఫీ గెలవకపోవడం గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బిగ్ బాస్ 4 టైటిల్ గెలవలేకపోయినా కోట్ల సంఖ్యలో అభిమానుల హృదయాలను మాత్రం తాను గెలుచుకున్నానని అఖిల్ అన్నారు.
చాలామంది బిగ్ బాస్ కంటెస్టెంట్లకు సెలబ్రిటీలు ఎక్కువగా సపోర్ట్ చేశారని.తనకు మాత్రం కేవలం ఇద్దరు సెలబ్రిటీలు మాత్రమే సపోర్ట్ చేశారని అఖిల్ అన్నారు.బిగ్ బాస్ హౌస్ లో కూడా కంటెస్టెంట్ల సపోర్ట్ లేకపోవడంతో తొలి వారమే ఎలిమినేట్ అవుతానని భావించానని.
మోనాల్ తన స్వీట్ హార్ట్ అని.తను మాత్రమే చివరి వరకు తోడుగా నిలబడిందని అఖిల్ తెలిపారు.అభిమానుల ప్రేమను ఇంకా పెంచుకునేలా వ్యవహరిస్తానని.అభిమానాన్ని తలకెక్కించుకోనని అఖిల్ అన్నారు.
తాను ట్రోఫీ గెలుచుకోలేక పోయానని కానీ అభిమానుల హృదయాలను గెలుచుకున్నానని అఖిల్ తెలిపారు.బిగ్ బాస్ ఇచ్చిన గేమ్ లు సింగిల్ గా, బాగా ఆడానని.
కొందరు నాపై బ్యాడ్ ట్రోలింగ్స్ వచ్చాయని చెప్పారని.మనిషి ఎదుగుతుంటే కొందరు తొక్కేయాలని చూస్తారని బ్యాడ్ ట్రోలింగ్ ను తాను పట్టించుకోనని అఖిల్ అన్నారు.
పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా అభిమానుల ప్రేమను పొందగలిగానని ఈ జన్మకు ఇది చాలు అని అఖిల్ తెలిపారు.