అక్కినేని అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు.బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటించింది.
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా నిర్మించారు.కెరియర్ లో 3 సినిమాలు తీసినా ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోని అఖిల్ బ్యాచ్ లర్ సినిమాతో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు.
సినిమా తప్పకుండా అఖిల్ కు హిట్ ఇస్తుందని చెబుతున్నారు.ఇక ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైరక్షన్ లో అఖిల్ ఏజెంట్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాను అనీల్ సుంకర నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా కన్నడ భామ రష్మిక మందన్నని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తున్న రష్మిక మరో స్టార్ ప్రాజెక్ట్ లో డిస్కషన్ స్టేజ్ లో ఉంది.దానితో పాటుగా అఖిల్ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది.
అఖిల్, రష్మిక జోడీ అదిరిపోతుందని చెప్పొచ్చు.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న బ్యాచ్ లర్ తో హిట్ కొట్టి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఏజెంట్ తో స్టార్ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు అక్కినేని హీరో.
అఖిల్ ఈ రెండు సినిమాలతో సత్తా చాటాలని చూస్తున్నాడు.
.