రెండు తెలుగు రాష్ట్రా రాజకీయాల్లో హైదరాబాద్ బోయినపల్లి కిడ్నాప్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ప్రథమ నిందితురాలిగా ఉండటంతో రాజకీయ వర్గాల్లో బోయినపల్లి కిడ్నాప్ కేసు చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసులో అఖిలప్రియకు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది.
గతంలో సికింద్రాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా పోలీసులు అఖిల ప్రియ కు బెయిల్ ఇవ్వవద్దు అంటూ కౌంటర్ దాఖలు చేయడం జరిగింది.
అంతే కాకుండా ఆమెకు జీవిత ఖైదు పడే అవకాశం ఉందని కౌంటర్ పిటిషన్ లో సెక్షన్ ని కూడా యాడ్ చేయడం జరిగింది.దీంతో సికింద్రాబాద్ కోర్టు బెయిల్ తిరస్కరించింది.
ఈ తరుణంలో అఖిల ప్రియ తరపున న్యాయవాదులు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
అఖిలప్రియ కస్టడీ విచారణ పూర్తయిందని ఆమె అనారోగ్యం కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేయాలని కోరటంతో సెషన్స్ కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేయడం జరిగింది.మొత్తం ఈ కేసులో పోలీసులు 19 మందిని అరెస్టు చేశారు.భూ వివాదానికి సంబంధించిన ఈ కేసులో ప్రవీణ్ రావు అతని సోదరులు భూమా అఖిల ప్రియా గ్యాంగ్ కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించడం అడ్డంగా దొరికి పోవడంతో పోలీసులు అఖిల ప్రియ ను ప్రధాన నిందితురాలు గా పేర్కొన్నారు.
.