అక్కినేని అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో అఖిల్ సరసన ప్రముఖ హీరోయిన్ పూజాహెగ్దే హీరోయిన్గా నటించనుంది.బోమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమానకు దర్శకత్వం వహిస్తుండగా.జీఏ2 పిశ్చర్స్ పతాకంపై బన్నీ వాసు, వాసు వర్మ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గోపీ సుందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు ఆ సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది.ఈ క్రమంలో ఈ సినిమా టీజర్ను రేపు ఉదయం 11.40 గంటలకు విడుదల చేయనున్నట్లు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా యూనిట్ ట్విట్టర్లో ప్రకటించింది.అందరూ రెడీగా ఉండాలని, ఈ టీజర్ తప్పనిసరిగా అందరినీ అలరిస్తుందని సినిమా యూనిట్ స్పష్టం చేసింది.
వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ట్విట్టర్లో పేర్కొంది.
ఇప్పటివరకు అఖిల్ హీరోగా వచ్చిన ఏ సినిమా కూడా పెద్ద విజయం సాధించలేదు.
దీంతో ఈ సినిమాతోనైనా అక్కినేని అఖిల్ విజయాన్ని అందుకుంటాడా.లేదా.
అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది.ఈ సినిమాపై అక్కినేని అఖిల్ అభిమానులు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు.
మరి చూడాలి ఈ సినిమాతో అఖిల్ విజయాన్ని అందుకుంటాడా .లేదా అనేది.