టాలీవుడ్ అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజన్ రోజు రోజుకు రంజుగా కొనసాగుతోంది.ఈ వారం అమ్మ రాజశేఖర్ మాస్టర్, హారిక, అభిజిత్, అవినాష్ మరియు మోనాల్లు నామినేషన్స్లో ఉన్నారు.
వీరిలో ఒకరు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి దుకాణం సద్దేయనున్నారు.ఇక నిన్న శనివారం కావడంతో.
హోస్ట్ నాగార్జున వచ్చి ఇంటి సభ్యులతో సందడి చేశారు.అలాగే బర్త్డే సందర్భంగా కమల్ హాసన్ తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్లతో సహా వర్చువల్ తెరమీద కనిపించి.
తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ట్రీట్ ఇచ్చారు.
ఇక కమల్ హాసన్ వెళ్తూ వెళ్తూ.
చివర్లో నామినేషన్స్లో ఉన్న హారికను సేవ్ చేశారు.అనంతరం నాగార్జున టీ స్టాండు టాస్కులో చివరి వరకు ఆడిన మోనాల్, అవినాష్లకు బంపర్ ఛాన్స్ ఇచ్చారు.
వారిద్దరిలో ఎవరో ఒకరికి నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీని అందించే ఛాన్స్ను ఇంటి సభ్యలకు ఇచ్చారు.అందులో భాగంగా అవినాష్, మోనాల్ ఇద్దరికీ చెరో బుట్ట ఇచ్చి.
ఇంటిసభ్యులు ఎవరిని సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వారి బుట్టలో తమ వస్తువులను త్యాగం చేయాలని నాగార్జున తెలిపారు.
బజర్ మోగే సమయానికి ఎవరి బుట్ట ఎక్కువ బరువుతో ఉంటుందో వారికి ఇమ్యూనిటీ లభిస్తుందని వివరించారు.దీంతో అవినాష్.`మళ్లీ తీసుకోమన్నా నేను షోను వదులుకుని వచ్చాను.
ఇల్లు అప్పులు తీర్చాలి.మా కుటుంబాన్ని నేనే చూసుకోవాలి.
నాకు ఇమ్యూనిటీ కావాలి.సపోర్ట్ చేయండి` అంటూ సింపథీ క్రీయేట్ చేశారు.
మరోవైపు మోనాల్ కూడా తన ఇమ్యూనిటీ కావాలి.ప్లీజ్ సపోర్ట్ చేయమని కోరింది.
అయితే మోనాల్ను నామినేట్ చేసిన అఖిల్నే ఆమె కోసం ఒంటరిగా పోరాటి తన వస్తువులను త్యాగం చేశాడు.లాస్య, సోహైల్, మెహబూబ్, అరియానాలు మాత్రం అవినాష్కు సపోర్ట్ చేస్తూ.
తమ వస్తువులను అవినాష్ బుట్టలో నింపారు.ఇక హారిక తన వస్తువులు మోనాల్ కోసం త్యాగం చేద్దామని అనుకునే సమయానికి బజర్ మోగిపోయింది.
దీంతో చివరకు అవినాష్ బుట్ట 23 కిలోలు, మోనాల్ బుట్ట 13 కిలోల బరువు తూగింది.ఫలితంగా తర్వాత వారానికి ఇమ్యూనిటీ పొందాడు అవినాష్.
ఏదేమైనా అఖిల్ ఎంత ఒంటరిగా పోరాటం చేసినా.అవినాష్ సింపథీతో ఇంటి సభ్యులను తనవైపుకు తిప్పుకున్నాడు.