అక్కినేని నట వారసుడు అఖిల్ అక్కినేని ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు.గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
ఇందులో అఖిల్ జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది.ఈ సినిమా మీద అఖిల్ చాల హోప్స్ పెట్టుకున్నాడు.
యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని ఆవిష్కరించారు.ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు.అండర్ కవర్ కాప్ పాత్రలో అఖిల్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.
రెగ్యులర్ క్యారెక్టర్స్ చేసిన ఏం చేయాలో తెలియని గందరగోళం లో ఉన్న సంగతి తెలిసిందే.ఈ నేపధ్యంలో సురేందర్ రెడ్డి ఈ సారి అఖిల్ ని కొత్తగా రిప్రజెంట్ చేసే బాద్యత తీసుకున్నాడు.
ఇక ఇప్పటికే ఏజెంట్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి అందరిలో క్యూరియాసిటీ పెంచింది.ఫస్ట్ లుక్ బట్టి ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా ఈ సినిమా ఉండబోతుందని అర్ధమవుతుంది.
ఇదిలా ఉంటే అఖిల్ ఇప్పుడు మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఆర్ఆర్ 100 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం శర్వానంద్, సిద్దార్ద్ కాంబోలో మహా సముద్రం అనే సినిమా చేస్తున్నాడు .ఈ సినిమా తర్వాత్ మా అజయ్ భూపతి అఖిల్ తో సినిమా చేయనున్నాడు.ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు.
ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ అయిపోయిందని తెలుస్తుంది.త్వరలో ఈ సినిమాకి ముహూర్తం ఫిక్స్ చేసి ఎనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.
.