అక్కినేని నాగార్జున నట వారసుడుగా టాలీవుడ్ లో పరిచయం అయిన అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమానే చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు.అయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.
తరువాత అఖిల్ కెరియర్ లో వరుసగా హ్యాట్రిక్ ఫ్లాప్ లు వచ్చాయి.స్టార్ హీరోగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్న అఖిల్ కి ఈ డిజాస్టర్ లు ఊహించని విధంగా దెబ్బ కొట్టాయని చెప్పాలి.
అంచనాలు పెంచుకున్న ప్రతి సారి సినిమా అపజయం అవుతూ వచ్చింది.అందుకే ఈ సారి తన నాలుగో సినిమాగా వస్తున్నా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ మూవీ విషయంలో అలాంటి తప్పు జరగకుండా అఖిల్ ప్లాన్ చేసుకుంటున్నాడు.
టాలీవుడ్ లో హీరోల పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి టీజర్, ట్రైలర్ లాంటివి విడుదల చేయడం చేస్తూ ఉంటారు.అయితే ఇప్పుడు అఖిల్ కొత్త సినిమా విషయంలో తన సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ ఉండదని క్లారిటీ ఇచ్చేశాడు.
నిర్మాతలు టీజర్ రిలీజ్ చేద్దామని చెప్పిన తానె వద్దని వారికి చెప్పినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేశాడు.భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో ఎలాంటి హడావిడి లేకుండా, భారీ అంచనాలు పెంచకుండా సైలెంట్ గా వచ్చి హిట్ కొట్టాలని అఖిల్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.
గత మూడు సినిమాల విషయంలో చేసిన తప్పుని ఈ సినిమా విషయంలో చేయకూడదని అఖిల్ ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తుంది.ఈ నేపధ్యంలో సినిమాకి సంబందించిన అప్డేట్స్ తన పుట్టినరోజు నాడు లేకుండా చేసుకున్నాడు అని తెలుస్తుంది.