అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమా ఇప్పటికే షూటింగ్ చేసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో అఖిల్ కచ్చితంగా హిట్ కొడతాడని చిత్ర యూనిట్ భావిస్తోంది.
కాగా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అఖిల్ ఈ సినిమా విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్త పడుతున్నాడు.
ఈ క్రమంలో ఈ సినిమా షూటింగ్ విషయంలో తన తండ్రి నాగార్జున చెప్పిన మాటల ప్రకారం ముందుకు వెళుతున్న అఖిల్, ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేస్తాడని అందరూ అనుకున్నారు.
కానీ పరిస్థితి చూస్తే మరోలా ఉంది.ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చిందని అందరూ అనుకున్నారు.కానీ సినిమా షూటింగ్ సగం కూడా కాలేదని తెలుస్తోంది.అతి జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ సినిమా షూటింగ్ చాలా నెమ్మదిగా సాగుతోందట.
ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనే విషయంపై క్లారిటీ లేకపోవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.