అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’.ఈ సినిమాలో అఖిల్ కు జంటగా బుట్టబొమ్మ పూజ హెగ్డే నటించింది.
ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల అయిన విషయం తెలిసిందే.ఇక అఖిల్ కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
అఖిల్ 6 ఏళ్లగా ఏ హిట్ కోసమైతే తపించి పోతున్నాడో ఆ హిట్ బ్యాచిలర్ సినిమా ద్వారా రావడంతో అఖిల్ గాలిలో తేలిపోయాడు.
ఈ సినిమాను బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు.
ఇక ఈ సినిమా బయ్యర్లకు బాగానే కలిసి వచ్చింది.ఇక మోస్ట్ ఎలిజిబుల్ బైచిలర్ మొన్నటి వరికి థియేటర్స్ లో సందడి చేసి ఇప్పుడు ఓటిటి లో రిలీజ్ అయ్యింది.
ఈ సినిమా ఈ రోజు నవంబర్ 19 న ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ అయ్యింది.ఆహా ఒటిటి విజయవంతంగా 20 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆహా 2.0 తో సరికొత్తగా అవతిరించింది .
తాజాగా ఆహా ఓటిటి లో ఈ రోజు బ్యాచిలర్ సినిమా స్ట్రీమింగ్ అయ్యింది.థియేటర్స్ లో సత్తా చాటిన బ్యాచిలర్ సినిమా ఓటిటి లో ఎలాంటి రిజల్ట్ వస్తుందో వేచి చూడాలి .ఇక ఇంత పెద్ద హిట్ వచ్చిన జోష్ లో అఖిల్ తర్వాత చేసే ఏజెంట్ సినిమాను కూడా అంతే హుషారుగా పూర్తి చేస్తున్నాడు.ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.ఏజెంట్ సినిమాలో అఖిల్ లుక్ అభిమానులందరినీ ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది.ఈ భారీ యాక్షన్ సినిమాను ఏకే ఎంటర్టైన్ మెంట్స్, సురేందర్ రెడ్డి 2 సినిమా సంయుక్తంగా నిర్మిస్తుండగా మ్యూజిక్ సెన్సషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ప్రెసెంట్ ఆ సినిమా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుపు కుంటుంది.మరి ఈ సినిమాతో అఖిల్ మరొక హిట్ ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.