అక్కినేని అఖిల్ ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మెప్పించలేక పోయాయి.ప్రేక్షకులు అఖిల్ నుండి ఒక మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ను ఆశిస్తున్నారు.
ప్రస్తుతం అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.ఆ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
వచ్చే దసరాకు అఖిల్ 4 చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.
అఖిల్కు ఈ అమ్మడు మంచి జోడీ అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వీరిద్దరి మద్య ఉండే కొన్ని రొమాంటిక్ సీన్స్ సినిమాకు హైలైట్గా ఉంటాయని, వీరిద్దరి మద్య లవ్ సీన్స్ యూత్ ఆడియన్స్ను కట్టి పడేస్తాయంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
అక్కినేని ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న అఖిల్ 4 చిత్రం టైటిల్ను అతి త్వరలోనే రివీల్ చేయడంతో పాటు ఫస్ట్లుక్ను కూడా విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
అక్కినేని ఫ్యాన్స్కు ఈసారి అఖిల్ నుండి ఒక మంచి సక్సెస్ రాబోతుందని, బొమ్మరిల్లు తరహాలో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ను దర్శకుడు భాస్కర్ ఇవ్వబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న కారణంగా కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.అఖిల్ కోసం స్వయంగా అల్లు అరవింద్ ఈ కథలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయడంతో పాటు, స్క్రిప్ట్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటూ ప్రతి రోజు షూటింగ్ను మానిటర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ కారణాల వల్ల సినిమా హిట్ అంటూ టాక్ వస్తుంది.