అక్కినేని వారసుడి గా టాలీవుడ్ లో అడుగుపెట్టినప్పటికీ ఒక్క హిట్ కూడా లేకుండా అఖిల్ మరుగున పడిపోతున్నాడు.సినిమాల కు రాకముందు అఖిల్ ను చూసిన వారు అతడి ఫిజిక్,లుక్స్ చూసి సినిమాల్లో సూపర్ హీరోగా రాణిస్తాడు అని అంచనా వేశారు.
కానీ సినిమాల్లో హీరోగా పరిచయమై 5 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటివరకు కూడా ఒక్క హిట్ అందుకోలేకపోయాడు.అఖిల్ మూవీ తో హీరోగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అక్కినేని వారసుడు అఖిల్ వరుస సినిమాలు చేసినప్పటికీ కూడా ఒక్క చిత్రం కూడా హిట్ సాధించలేకపోయింది.
దీనితో అఖిల్ ప్రస్తుతం హిట్ కోసం ఆరాటపడిపోతున్నాడు.అందుకే ఈ సారి దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తో చిత్రం ప్లాన్ చేసుకున్నాడు.యాక్షన్ చిత్రాలకంటే కూడా లవ్ స్టోరీస్ అయితేనే బాగుంటుంది అని భావించి క్లాసిక్ మూవీ డైరక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రం చేస్తున్నాడు.ఈ చిత్రంలో అఖిల్ కు జోడీ గా అందాల భామ పూజ హెగ్డే నటిస్తుంది.
అయితే ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ లు నిలిచిపోవడం తో ఈ చిత్రం కూడా ఆగిపాయింది.అయితే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా షూటింగ్ ల విషయంలో లాక్ డౌన్ సడలింపులు కారణంగా ఆగిపోయిన చిత్రాలు అన్ని కూడా మరోసారి పట్టాలెక్కనున్నాయి.
ఈ క్రమంలోనే అఖిల్,భాస్కర్ ల చిత్రం కూడా జులై లో షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తుంది.అయితే జులై లో షూటింగ్ ప్రారంభించగానే పాటతో ఈ చిత్రం ప్రారంభించాలి అని అఖిల్ భావిస్తున్నాడట.ముందు ఏది మొదలు పెట్టినా ప్రసుతం అఖిల్ ముందు ఉన్న అతిపెద్ద టార్గెట్ ఎలాగైనా హిట్ కొట్టి కుటుంబ వారసత్వం నిలబెట్టాలి అని.మరోపక్క ఈ సినిమా పైన హీరోతో పాటుగా అక్కినేని అభిమానులు కూడా చాలానే ఆశలు పెట్టుకున్నారు.చూడాలి మరి ఈ సినిమాతోనైనా అఖిల్ కు విజయం లభిస్తుందా లేదా అనేది.