అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే.గోపీసుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని రిలీజైన సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచింది.
జూన్, జూలైలో రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడ్డది.అయితే ఇప్పుడు అఖిల్ బ్యాచ్ లర్ సినిమాకు భారీ ఓటిటి ఆఫర్లు వస్తున్నాయట.
సినిమాకు ప్రముఖ ఓటిటి నుండి ఫ్యాన్సీ ఆఫర్ వచ్చిందట.నిర్మాతలు టెంప్ట్ చేసేలా ఈ ఆఫర్ ఉందని తెలుస్తుంది.
అయితే అఖిల్ మాత్రం తన సినిమా ఓటిటి రిలీజ్ అవడంపై ఇంట్రెస్ట్ చూపట్లేదని తెలుస్తుంది.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా అఖిల్ కెరియర్ లో కమర్షియల్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి.
బ్యాచిలర్ తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి డైరక్షన్ లో ఏజెంట్ సినిమా చేస్తున్నారు.ఆ సినిమా మాత్రం మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.
ఇది కూడా ఈ ఇయర్ డిసెంబర్ 24న రిలీజ్ చేయాలని చూస్తున్నారట.