అక్కినేని అఖిల్, పూజా హెగ్దే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకు గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు.
యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో అఖిల్, పూజా హెగ్దే ల జోడీ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు.దసరా కానుకగా అక్టోబర్ 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది.
ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య అటెండ్ అయ్యారు.
ఇక ఈ ఈవెంట్ లో అఖిల్ స్పీచ్ హైలెట్ గా నిలిచిందని చెప్పొచ్చు.
అక్కినేని ఫ్యాన్స్ తో పాటుగా ప్రేక్షకుల ఉద్దేశిస్తూ అఖిల్ మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే వరకు నిద్రపోను అంటూ మాట్లాడాడు.అక్కినేని అభిమానులకు ఇదే నా ప్రామిస్ అని చెప్పడం ఫ్యాన్స్ ను అలరించింది.
బ్యాచిలర్ సినిమాపై అఖిల్ చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడని అర్ధమవుతుంది.సినిమా ట్రైలర్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచింది.
కెరియర్ లో ఇప్పటివరకు కమర్షియల్ హిట్ అందుకోని అఖిల్ బ్యాచిలర్ తో మొదటి హిట్ తన ఖాతాలో వేసుకుంటాడా లేదా అన్నది చూడాలి.