అఖిల్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా మోస్ట్ వెయిటింగ్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయినప్పటి నుండి ఇప్పటి వరకు సినిమా గురించి రకరకాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.
కాని ఇప్పటి వరకు ఈ సినిమా విడుదల కాలేదు.ఎట్టకేలకు దసరాకు ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
కాస్త పోటీ ఎక్కువ ఉన్నా కూడా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా మంచి సమయంలో వస్తుందంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే మరియు అఖిల్ ల మద్య ఉండే రొమాంటిక్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.
సినిమా లో హీరోయిన్ కాస్త ఓవర్ మోడ్రన్ మరియు ఫాస్ గా ఉంటుందట.హీరో ను కాస్త డామినేట్ చేసే విధంగా ఆమె పాత్ర మరియు గ్లామర్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
మొత్తంగా అఖిల్ అక్కినేని తో పూజా హెగ్డే చేసే రొమాన్స్ కాస్త ఘాటుగా ఉన్నా కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుందని అభిమానులు అంటున్నారు.
అక్కినేని హీరోలు అంటేనే రొమాంటిక్ హీరోలు అన్న పేరు ఉంటుంది.అలాంటి అక్కినేని అఖిల్ మరియు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేలు కలిసి నటిస్తే రొమాన్స్ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి.తప్పకుండా ఈ సినిమా ఆకట్టుకునే విధంగా ఉంటుందని.
అన్ని వర్గాల వారిని అలరించే విధంగా ఉంటుందని అంటున్నారు.ప్రస్తుతం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా ప్రమోషన్ కోసం విడుదల చేసిన పాటలు మరియు టీజర్ ఇంకా ట్రైలర్ లో చూపించిన రొమాన్స్ ను మించి సినిమా లో ఉంటుందని.
తప్పకుండా యూత్ కు కనెక్ట్ అయ్యే విధంగా రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.సినిమా కు క్లీన్ యూ ఇవ్వక పోవడంకు అదే కారణం అని కూడా కొందరు అంటున్నారు.
మొత్తానికి అఖిల్ కు ఈ సినిమా మొదటి కమర్షియల్ హిట్ గా నిలువబోతుంది అంటూ అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు.