అక్కినేని అఖిల్ ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశాడు.ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను నిరాశ పర్చుతూనే ఉంది.
మొదటి సినిమా అఖిల్ ఆ తర్వాత హలో మరియు ఈమద్య వచ్చిన మిస్టర్ మజ్ను ఇలా ప్రతి సినిమా కూడా ఆయనకు మరియు ఆయన అభిమానులకు నిరాశ కలిగిస్తూనే ఉంది.ఈ సమయంలోనే అఖిల్ తన 4వ సినిమాకు బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో తన కొత్త సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.
ఈ సినిమాతో అయినా అఖిల్ సక్సెస్ దక్కించుకుంటాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అఖిల్తో ఇప్పటి వరకు నటించిన ముగ్గురు ముద్దుగుమ్మలు కూడా ఆయనకు సెట్ అవ్వలేదు అంటూ టాక్ వచ్చింది.
ఆయనతో నటించని హీరోయిన్స్ ఆయనకు అక్కల మాదిరిగా ఉన్నారనే కామెంట్స్ కూడా వచ్చాయి.ఈసమయంలోనే అఖిల్ 4లో పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే.వీరిద్దరి కాంబో లుక్ ఇప్పటి వరకు బయటకు రాలేదు.దాంతో మళ్లీ పలు అనుమానాలు వచ్చాయి.
పూజా ఎలా అఖిల్కు సెట్ అవుతుందంటూ చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు.
పూజా హెగ్డే మరియు అఖిల్లు తాజాగా ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కు వెళ్లారు.అక్కడ వీరిద్దరు కలిసి ఉన్న ఒక ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది.ఆ ఫొటోతో అఖిల్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
అఖిల్కు ఇప్పుడు సరైన జోడీ లభించింది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అఖిల్ సినిమాలు వరుసగా ఫెయిల్ అవ్వడానికి ఒక కారణం హీరోయిన్స్.
ఈసారి అఖిల్కు మంచి జోడీ దక్కడంతో అఖిల్ 4 సక్సెస్ ఖాయం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.