టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకుల జాబితాలో రాజమౌళి తర్వాత కొరటాల శివ, అనిల్ రావిపూడి ఉన్నారని చెప్పాలి.వరుసగా ఐదు విజయాలతో అనిల్ రావిపూడి కమర్షియల్ ఫార్ములా కథలతో స్టార్ హీరోలని మెప్పిస్తూ మరో వైపు ఆడియన్స్ ని కూడా ఎంటర్టైన్ చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నాడు.
అతను పట్టిన కథలన్నీ హిట్ అయ్యేలా కెరియర్ సాగుతుంది.సరిలేరు సినిమాతో సూపర్ స్టార్ మహేష్ తో సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి నెక్స్ట్ ఎఫ్ 3 సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ లోపు ఓ ఫీమేల్ సెంట్రిక్ మూవీని సాయి పల్లవితో ప్లాన్ చేయాలని అనుకుంటున్నాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో క్రేజీ మల్టీ స్టారర్ కథని కూడా అనిల్ రావిపూడి సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.దీనికి సంబంధించి హాట్ టాపిక్ ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.అక్కినేని ఫ్యామిలీ నుంచి మనంతో ఇప్పటికే ఒక మల్టీ స్టారర్ వచ్చింది.
ఇదిలా ఉంటే చిన్న కొడుకు అఖిల్ ని ఎలా అయినా స్టార్ హీరోగా నిలబెట్టాలని నాగార్జున భావిస్తున్నాడు.దానికి తగ్గట్లే దర్శకులని రెడీ చేస్తున్నాడు. అఖిల్ నెక్స్ట్ సినిమాని సురేందర్ రెడ్డితో ప్లాన్ చేశారు.ఇదిలా ఉంటే ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తనయుడుతో కలిసి మల్టీ స్టారర్ చేయడానికి కింగ్ నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
అదిరిపోయే కమర్షియల్ స్టోరీ లైన్ ని నాగార్జునకి అనిల్ వినిపించడం జరిగిందని సమాచారం.కథ నచ్చడంతో నాగార్జున ఒకే చెప్పేసాడని తెలుస్తుంది.అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనేది అప్పుడే తెలియదు.ప్రస్తుతం నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో హిందీ రైడ్ మూవీ రీమేక్ తో పాటు బంగార్రాజు సినిమా కూడా చేస్తున్నాడు.
అలాగే అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది.ఈ ప్రాజెక్ట్ లు పూర్తయిన తర్వాత అనిల్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉందని టాక్.