అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్కు రెడీగా ఉంది.ఈ సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకోవాలని అఖిల్ చూస్తున్నాడు.
ఇక ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.కాగా ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
కాగా అఖిల్ తన నెక్ట్స్ చిత్రాన్ని లైన్లో పెట్టేందుకు ఇప్పటికే పలు కథలు వింటున్నాడు.ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి చెప్పిన ఓ కథ అఖిల్కు నచ్చిందని తెలుస్తోంది.
కానీ ఆ డైరెక్టర్కు అఖిల్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం గమనార్హం.దీంతో సురేందర్ రెడ్డి కొంతకాలంగా అఖిల్ నిర్ణయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు.అయితే ఈ క్రమంలో మరో దర్శకుడు తేజ అఖిల్ కోసం ఓ యూత్ఫుల్ కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ కథను అఖిల్తో పాటు నాగ్కు కూడా ఆయన వినిపించాడట.
నాగ్కు ఈ కథ నచ్చడంతో కొన్ని మార్పులు చేసి తీసుకురావాలని, ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రెడీగా ఉండాలని తేజకు సూచించినట్లు తెలుస్తోంది.దీంతో అఖిల్ నెక్ట్స్ మూవీకి ఖచ్చితంగా వి‘జయం’ అందించే దర్శకుడు దొరికినట్లే అని అక్కినేని ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.
అయితే దర్శకుడు తేజ ఇప్పటికే మ్యాచో స్టార్ గోపీచంద్తో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.మరి ఆ సినిమాను పక్కనబెట్టి అఖిల్తో సినిమా చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.