అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ చేసిన మొదటి సినిమా ‘అఖిల్’ పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.దాంతో నాగార్జున రక్షణాత్మక ధోరణిలోకి వెళ్లిపోవటంతో అఖిల్ రెండో సినిమాపై ఇంతవరకు క్లారిటీ రాలేదు.
మొదట వంశీ పైడిపల్లితో సినిమా ఫైనలైజ్ అయిందనే వార్తలు వచ్చాయి.ఆ తర్వాత హను రాఘవపూడి పేరు హల్ చల్ చేసింది.
ఆ తర్వాత ‘మనం’ సినిమాని తీసిన విక్రమ్ కె కుమార్ పేరు కూడా వచ్చింది.ఇప్పుడు తాజాగా అఖిల్ సినిమా మీద మరొక కొత్త న్యూస్ హల్ చల్ చేస్తుంది.
నాగార్జున నటించిన ‘మన్మధుడు’ ఎంత ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలిసిన విషయమే.ఇప్పుడు ఆ సినిమాకి కధ, మాటలు అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ‘మన్మధుడు’ సినిమాకి సీక్వెల్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో నాగ్ ఉన్నాడట.
రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన మన్మధుడు సీక్వెల్ చేస్తే అఖిల్ హిట్ ట్రాక్ ఎక్కుతాడని ఆశిస్తున్నాడు నాగ్.అయితే ఈ సీక్వెల్ కార్యరూపం దాల్చేవరకు వేచి చూడాల్సిందే.