అక్కినేని అఖిల్ పుట్టిన రోజు నేడు.ఈ సందర్బంగా వేడుకలు, హంగామాలు ఏమీ లేకుండా సింపుల్గా తన బర్త్డేను జరుపుకోవాలని నిర్ణయించుకున్నాడు.
కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరిని తీవ్ర అవస్థలకు గురి చేస్తున్న ఈ సమయంలో అఖిల్ పుట్టిన రోజు వేడుకలను రద్దు చేఉకున్నట్లుగా ప్రకటించాడు.ఈ విషయాన్ని ఒక వీడియో సందేశంలో చెప్పుకొచ్చాడు.
అఖిల్ అక్కినేని ప్రస్తుతం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటిస్తున్నాడు.
ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి హడావుడి కూడా కనిపించడం లేదు.
ఇదే సమయంలో అఖిల్ అక్కినేని ఫ్యాన్స్కు చిన్న సవాల్ విసిరాడు.ఈమద్య కాలంలో ఛాలెంజ్ు ఎక్కువగా విసురుతున్నారు.
అలాగే అఖిల్ కూడా నేను ఈ పుట్టిన రోజుకు నా సినిమా ఫొటోలను ఏమీ విడుదల చేయబోవడం లేదు.కాని నేను రేపు ఒక ఫొటోను పోస్ట్ చేయబోతున్నాను.
నా కుటుంబ సభ్యులతో నేను ఇంట్లోనే ఉండి ఒక ఫొటో తీసుకుని దాన్ని పోస్ట్ చేస్తాను అన్నాడు.
నేను పోస్ట్ చేసినట్లుగా మీరు కూడా ఇంటికే పరిమితం అయ్యి మీ కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోను నాతో షేర్ చేయండి అంటూ విజ్ఞప్తి చేశాడు.ఇంటికే పరిమితం అయ్యి మీ ఆరోగ్యం మీకుటుంబ ఆరోగ్యంను కాపాడుకోండి అంటూ పుట్టిన రోజు సందేశాన్ని అఖిల్ ఇచ్చాడు.అక్కినేని ఫ్యాన్స్ అఖిల్ ఛాలెంజ్ను స్వీకరించి కుటుంబంతో ఉన్న ఫొటోలను షేర్ చేస్తున్నారు.
ఇక కరోనా విపత్తు నుండి బయట పడ్డ తర్వాత మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందని అక్కినేని వర్గాల వారు ప్రకటించారు.