అఖిల్ అక్కినేని ఇదివరకే పలు సినిమాల్లో నటించినప్పటికీ ప్రేక్షకులు అతనిని ఆదరించ లేకపోయారు.అఖిల్ ఇదివరకు నటించిన సినిమాలన్ని ఫ్లాప్ సినిమాలుగానే మిగిలిపోయాయి.
అయితే తాజాగా అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్సినిమాలో పూజాహెగ్డే జంటగా నటించారు.అయితే ఈ సినిమాపై అఖిల్ భారీ అంచనాలను పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాను పూర్తి చేసుకున్న అఖిల్ తర్వాత సినిమాను స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్నట్లు ఇది వరకే మనకు తెలిసిన విషయమే.
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోయే అఖిల్ సినిమాలో పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా సురేందర్ రెడ్డి, అఖిల్ కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా గురించి తాజా సమాచారం ఒకటి హల్ చల్ చేస్తోంది.సురేందర్ రెడ్డి తెరకెక్కించే ఈ సినిమాను స్పై థ్రిల్లర్ గా రూపొందించబోతున్నారనే సమాచారం వినబడుతోంది.
హాలీవుడ్ స్పై సిరీస్ ది బర్న్ ను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేస్తూ కథను వక్కంతం వంశీ ఈ సినిమాను రూపుదిద్దుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవితో సైరా సినిమా తరువాత సురేందర్ రెడ్డి రెండు సినిమాలను చేయడానికి ఒప్పుకున్నారు.అందులో ఒకటి అఖిల్ సినిమా కాగా మరొకటి పవన్ కళ్యాణ్ సినిమా అని తెలుస్తోంది.ఇప్పటి వరకు అఖిల్ నటించిన సినిమాలలో కెల్లా 40 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోందని చెప్పవచ్చు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, సురేందర్ రెడ్డి సినిమాలపై అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా జూన్ 19 న విడుదల కానుంది.
అయితే త్వరలోనే సురేందర్ రెడ్డి సినిమా పట్టాలెక్కబోతోందని తెలుస్తోంది.