అక్కినేని కుటుంబంలో మూడవతరం యంగ్ హీరో అఖిల్.ఈయన అందం, నటన, ఫైట్స్, డ్యాన్స్ ఇలా అన్నిటిలో కూడా బెస్ట్ ఇస్తాడు.
కానీ ఈయనకు కాలం కలిసిరాక మొన్నటి వరకు హిట్ పడలేదు.అఖిల్ ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కెరీర్ లో మొదటి సూపర్ హిట్ అందుకున్నాడు.
ఈ సినిమా హిట్ ఇచ్చిన ఆనందంతో అఖిల్ మరింత సంతోషంగా ఉన్నాడు.
ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపు కుంటుంది.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.
బ్యాచిలర్ సినిమాలో క్లాస్ గా కనిపించిన అఖిల్ ఈ సినిమాతో ఊర మాస్ లుక్ లో కనిపించ బోతున్నాడు.దీంతో ఈ సినిమా కూడా హిట్ అయితే అఖిల్ కు మాస్ ప్రేక్షకుల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోవడం ఖాయం.
ఈయన ఏజెంట్ సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేయనున్నాడు.అయితే ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది.అందుకు రెండు కారణాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి.మొదటిది ఈ సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉందని ఆ గడువులోగా షూటింగ్ పూర్తి కాలేక పోవచ్చని అంటున్నారు.
మరో కారణం ఆ రోజున పలు క్రేజీ ప్రాజెక్ట్స్ విడుదల అవ్వనున్నాయి.
ఈ సినిమా కు తన అన్న చైతన్య నుండి పోటీ ఎదురవుతుంది.
ఈయన నటించిన హిందీ డెబ్యూ సినిమా లాల్ సింగ్ చద్దా అదే వారంలో రిలీజ్ కాబోతుంది.దాంతో పాటు సమంత కూడా అఖిల్ సినిమాకు పోటీ పడుతుంది.
ఈమె యశోద సినిమా ఆగష్టు 12నే రిలీజ్ చేయడానికి రెడీ అయ్యింది.అన్న, మాజీ వదినే అనుకుంటే ఇప్పుడు మరో ఆసక్తికర సినిమా కూడా అఖిల్ తో పోటీకి సై అంటుంది.
నితిన్ నటించిన మాచర్ల నియోజక వర్గం ఆగస్టు 12న రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారట.
ఈ నేపథ్యంలోనే అఖిల్ సినిమాని పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.నిజానికి ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 24నే రిలీజ్ చేయాలనీ ఫస్ట్ లుక్ రిలీజ్ సమయంలోనే ప్రకటించారు.కానీ కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది.
అందుకే ఈ సినిమాను ఆగష్టు 12న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు.కానీ ఇప్పుడు కూడా వాయిదా వేయక తప్పేలా లేదు.
మరి ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు టాక్.చూడాలి మరి ఏం జరుగుతుందో.