అక్కినేని అఖిల్ మొదటి మూడు సినిమాలు కూడా తీవ్రంగా నిరాశ పర్చాయి. రామ్ చరణ్ స్థాయిలో స్టార్ డం దక్కించుకుంటాడు అంటూ అక్కినేని అభిమానులు అఖిల్పై ఆశలు పెట్టుకుంటే ఆయన మాత్రం తీవ్రంగా నిరాశ పర్చాడు.
మొదటి సినిమా అఖిల్ భారీ బడ్జెట్ తో వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందింది.ఆ సినిమా ఫాంటసీ కథతో రూపొందిన విషయం తెల్సిందే.
అఖిల్ బాడీ లాంగ్వేజ్ మరియు ఇమేజ్కు ఆ కథ అస్సలు సెట్ అవ్వలేదు.భారీ యాక్షన్ సీన్స్ ఉన్నా కూడా ప్రేక్షకులు సినిమాను ఆదరించలేదు.
ఎందుకంటే కథ అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేదు.ఆ సినిమా ప్రభావం నుండి అఖిల్ ఇంకా కూడా బయట పడలేక పోతున్నాడు.
ఇలాంటి సమయంలో మళ్లీ అఖిల్ అలాంటి కథనే ఎంపిక చేసుకోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.త్వరలో అఖిల్ చేయబోతున్న సినిమా కథ ఫాంటసీ అంటూ ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.
ప్రస్తుతం అఖిల్ అక్కినేని
‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’
సినిమాలో నటిస్తున్నాడు.ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చేసింది.బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ ఒకటి రెండు వారాల్లో ప్రకటించే అవకాశం ఉంది.ఇదే సమయంలో అఖిల్ తదుపరి సినిమా విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
అఖిల్ 5 సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నాడు అనేది అందరికి తెలిసిన విషయమే.వీరి కాంబో కోసం వక్కంతం వంశీ ఒక మాంచి ఫాంటసీ కథను తయారు చేశాడట.
సూరీ అనుకున్న స్టోరీ లైన్ ను వంశీ అద్బుతంగా రెడీ చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
అయితే కొందరు మాత్రం ముఖ్యంగా అక్కినేని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా మళ్లీ ‘అఖిల్’ ఫలితాన్ని రిపీట్ చేయదు కదా అంటూ అనుమానంగా ఉన్నారు.