అక్కినేని హీరో అఖిల్ త్వరలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ఎలిజబబుల్ బ్యాచిలర్ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.
మరో వైపు అఖిల్ అయిదవ సినిమా కూడా ప్రారంభం అయ్యింది.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనీల్ సుంకర నిర్మాణంలో రూపొందుతున్న సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసేందుకు రంగం సిద్దం అయ్యింది.
ఈ నెల 8వ తారీకున ఈ సినిమా ఫస్ట్ లుక్ వస్తుందంటూ ప్రకటించారు.టైటిల్ ను కూడా అదే రోజున విడుదల చేయబోతున్నారు.
ఒక ఆసక్తికర కథాంశంతో రూపొందబోతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా పెంచే విధంగా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.అయితే మాకు టైటిల్ మరియు ఈ సినిమా బడ్జెట్ ఎంత అనే విషయమై ఎక్స్ క్లూజివ్ గా తెలిసింది.
ఆ వివరాల్లోకి వెళ్తే.సినిమా కు వారసుడు అనే టైటిల్ ను ఖరారు చేశారు.మోహన్ లాల్ మరియు అఖిల్ లు తండ్రి కొడుకులుగా నటిస్తున్న ఈ సినిమా లో కీలక పాత్రను సీనియర్ హీరోయిన్ పోషించబోతుంది.ఇక ఈ సినిమా కథ రీత్యా ఏకంగా 50 కోట్ల వరకు బడ్జెట్ పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.
అఖిల్ మార్కెట్ అంత లేదు.అయినా కూడా కథ పై నమ్మకంతో మరియు దర్శకుడు సురేందర్ రెడ్డి స్టైలిష్ టేకింగ్ పై నమ్మకంతో చిత్ర నిర్మాత ఈ మొత్తంను పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.
స్పై థ్రిల్లర్ ఎలిమెంట్స్ ను కలిగి ఉండే కథ ను ఈ సినిమాలో చూపించబోతున్నారు.రికార్డు స్థాయిలో అఖిల్ కోసం మొదటి సారి ఇంత ఖర్చు పెడుతున్నారు.
కనుక మరో సారి ఆయన సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు