టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ సినిమాను యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.ఈ హ్యాట్రిక్ సినిమాను ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఇటు బాలయ్య అటు బోయపాటి ఇద్దరు చాలా శ్రమిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదల అయ్యి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ టీజర్ చూసిన తర్వాత ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.
ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సయేశా సైగల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఈ మధ్యనే ఈ సినిమా తమిళనాడు షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
అయితే ఇంకా కొద్దిగా బాలన్స్ ఉందని తెలుస్తుంది.ఆ బాలన్స్ పార్ట్ ను షూట్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్.ఈ బాలన్స్ పార్ట్ ను హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో షూట్ చేయడానికి రెడీ అయినట్టు సమాచారం.
ఈ షూట్ లో బాలయ్య, ప్రగ్యా జైస్వాల్ తో పాటు ప్రధాన తారాగణం కూడా పాల్గొనబోతుందని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు.ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారా అని నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.
బాలయ్య ఈ మధ్య హిట్ కొట్టక చాలా రోజులు అవుతుండడంతో ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.