టాలీవుడ్లో పండగ సీజన్ వచ్చిందంటే చాలు తెలుగు సినిమాలు రిలీజ్కు క్యూ కడుతుంటాయి.అయితే కరోనా కారణంగా గతేడాది నుండి సినిమా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా మరోసారి థియేటర్లు తెరుచుకున్న నేపథ్యంలో తమ సినిమా రిలీజ్ డేట్లను వరుసగా ప్రకటిస్తున్నారు దర్శకనిర్మాతలు.ఈ జాబితాలో చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు అన్నీ ఉన్నాయి.
కాగా రాబోయే దసరా పండుగ సీజన్కు ఇప్పటికే సినిమాలు క్యూ కడుతున్నాయి.ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ను అక్టోబర్ 13న దసరా కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
కానీ ఇంకా సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఈ సినిమా దసరాకు రావడం సందేహంగా కనిపిస్తోంది.ఈ అవకాశాన్ని మరికొన్ని సినిమాలు ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి.ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య, నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రాలు ఉన్నాయి.అయితే ఈ రెండింటిలో ఆచార్య చిత్రం దసరా వరకు వెయిట్ చేస్తుందా లేక ముందే రిలీజ్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది.
కానీ బాలయ్య నటించిన అఖండ చిత్రం మాత్రం ఖచ్చితంగా దసరాకు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు ముగియడంతో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను త్వరలో పూర్తి చేయాలని, ఆ తరువాత ప్రమోషన్స్ మొదలుపెట్టి దసరా కానుకగా రిలీజ్ చేస్తే పండుగకు ప్రేక్షకులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చినట్లుగా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
దీంతో దసరా రేసులో ఏ సినిమా ఉన్నా లేకపోయినా, అఖండ మాత్రం ఖచ్చితంగా ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి.బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.