నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ సినిమా దసరాకు విడుదల లేనట్లే అని దాదాపుగా క్లారిటీ వచ్చేసింది.ఈ సినిమా ను పట్టుబట్టి మరీ చిత్ర యూనిట్ సభ్యులు సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారట.
దసరాకు ఈ సినిమా విడుదల చేయాలని భావించినా కూడా వర్క్ పూర్తి కాలేదు.హడావుడిగా ముగించి విడుదల చేయడం ఇష్టం లేని చిత్ర యూనిట్ సభ్యులు మెల్లగానే సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో సంక్రాంతికి వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా పూర్ణ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా కు తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ అయ్యింది.ఇప్పటి వరకు బాలయ్య కెరీర్ లో నమోదు అవ్వని నెంబర్ లు ఈ సినిమాకు గాను నమోదు అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం అఖండ సినిమా ను ఏపీలో ప్రముఖ బయ్యర్ 35 కోట్లకు గాను కొనుగోలు చేయడం జరిగింది.ఇక సీడెడ్ లో బాలయ్య కు ఉన్న పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అక్కడ బాలయ్య ప్లాప్ మూవీ కూడా వసూళ్ల వర్షం కురిపిస్తుంది.అందుకే అక్కడ అఖండ సినిమా ను బయ్యర్ ఏకంగా 12.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది.
ఇక నైజాం ఏరియాలో కూడా అఖండ సినిమాను 11 కోట్ల రూపాయలకు అమ్మేశారు.మొత్తంగా ఈ సినిమా మంచి మొత్తాలను దక్కించుకుంది.కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాలకు గాను రెండున్నర కోట్ల రూపాయల బిజినెస్ అయ్యింది.
ఇక ఓవర్సీస్ లో రెండు కోట్ల వరకు అమ్ముడు పోయినట్లుగా సమాచారం అందుతోంది.అన్ని చోట్ల కూడా ఈ సినిమా మంచి బిజినెస్ చేసింది.ఓవరాల్ గా ఈ సినిమా సాధించిన నెంబర్ బాలయ్య అభిమానులు గర్వించేలా ఉంది.మంచి టైమ్ లో విడుదల చేస్తే.
పోటీ లేకుండా సినిమా సక్సెస్ అయితే బాలయ్య ఈజీగా వంద కోట్ల రూపాయలను రాబట్టగల సమర్థుడు.అందుకే ఇంత భారీ మొత్తాలకు అమ్మేసినట్లుగా తెలుస్తోంది.