నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి అయినా ఇంకా సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో నందమూరి అభిమానులు నిరాశలో ఉన్నారు.
అయితే ఈ సినిమా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చుసిన ఎదురు చూపులు ఫలించాయి.ఉగాది పండుగ రోజు బాలయ్య బోయపాటి ఫ్యాన్స్ ను ఖుషీ చేసారు.
ఈ సినిమా టైటిల్ ను, టీజర్ ను విడుదల చేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేసారు.బాలయ్యను ఇంత వరకు చూడని సరికొత్త లుక్ లో కనిపించడం ఆ లుక్ కూడా ఆయనకు సెట్ అవ్వడంతో విడుదలైన టీజర్ రికార్డులు సృష్టించింది.
బోయపాటి, బాలయ్య సినిమా అంటే ముందే అంచనాలు పెరిగాయి.ఇంకా విడుదలైన టీజర్ చుసిన తర్వాత ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.
తాజాగా అఖండ సినిమా భారీ డీల్స్ కుదుర్చుకుందని సమాచారం.ఈ సినిమా శాటిలైట్ హక్కులతో పాటు ఓటిటి డీల్స్ కూడా ఓకే అయినట్టు సమాచారం.
ఓటిటి హక్కుల్ని హాట్ స్టార్ దక్కించుకోగా.సాటిలైట్ రైట్స్ ను మాటీవీ దక్కించుకుందని తెలుస్తుంది.
భారీ మొత్తం చెల్లించి డీల్ సెట్ చేసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.అంతేకాదు ఇది బాలయ్య కెరీర్ లో కూడా భారీ డీల్ అని సమాచారం.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సయేశా సైగల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.పూర్ణ ఒక కీలక పాత్రలో నటిస్తుంది.విలన్ రోల్ లో కోలీవుడ్ స్టార్ శరత్ కుమార్ ను ఫైనల్ చేసినట్టు సమాచారం అందుతుంది.ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాను మే 28 న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.