గత ఏడాది జనవరి లో సరిలేరు నీకెవ్వరు మరియు అలా వైకుంఠపురం లో సినిమాలు వచ్చాయి.ఆ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
అలా వైకుంఠపురం లో సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలువగా సరిలేరు నీకెవ్వరు సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.సంక్రాంతి సీజన్ తర్వాత వచ్చిన సినిమాలు నిరాశ పర్చగా ఆ తర్వాత నుండి కరోనా వల్ల సినిమాలు విడుదల అవ్వడమే గగనం అయ్యింది.
తెలుగు సినిమా పరిశ్రమ మాత్రమే కాకుండా యావత్ ప్రపంచం లోని సినిమా ఇండస్ట్రీ మూత పడ్డంత పనైంది.దాదాపు ఆరు నెలలు పూర్తిగా నిర్మానుశం… మళ్లీ మెల్ల మెల్లగా చిన్న సినిమాలు విడుదల అవుతున్నాయి అనుకుంటున్న సమయం లో అనూహ్యంగా సెకండ్ వేవ్ మొదలు అయ్యింది.
సెకండ్ వేవ్ కు కొన్ని రోజుల ముందు వకీల్ సాబ్ విడుదల అయ్యింది.
అప్పటికే సెకండ్ వేవ్ ఆందోళన ఉండటం వల్ల థియేటర్ల వద్ద ఆంక్షలు కనిపించాయి.మొత్తానికి గత ఏడాది జనవరి నుండి మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద జనాల రచ్చ కనిపించడం లేదు.ఎట్టకేలకు అఖండ సినిమా తో ఆ హడావుడి కనిపిస్తుంది.
కనీసం 23 నెలల తర్వాత ఈ రేంజ్ హడావుడి కనిపిస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.రికార్డు స్థాయిలో అఖండ విడుదల అయ్యింది.ఇదే సమయంలో సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక ఇంకా ప్రీ బిజినెస్ అంతా కూడా రచ్చ రచ్చ చేసింది.మొత్తానికి 23 నెలల తర్వాత సినిమా థియేటర్ల వద్ద బాంబులు కాల్చడం.
పాలాభిషేకాలు చూస్తున్నామని అభిమానులు అంటున్నారు.ఇలాంటివే ముందు ముందు మళ్లీ మళ్లీ జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు.