బాలకృష్ణ.బోయపాటి శ్రీనుల కాంబోలో రూపొందిన అఖండ సినిమా డిసెంబర్ 2న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అయ్యాయి.మరో వైపు యూఎస్ లో అఖండ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అయ్యాయి.డల్లాస్ లోని ఒక స్క్రీన్ లో వరుసగా మూడు షో లకు గాను ఒకే వ్యక్తి టికెట్టను కొనుగోలు చేయడం జరిగింది.ఆయన ఆ టికెట్లను ప్రదర్శించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అఖండ సినిమాను వరుసగా మూడు షో లు అది కూడా మొత్తం స్క్రీన్ కు తానే బుక్ చేయడం చర్చనీయాంశంగా మారింది.కేవలం డల్లాస్ లోనే కాకుండా యూఎస్ లో పలు ప్రాంతాల్లో పలు స్క్రీన్స్ లో అడ్వాన్స్ బుకింగ్ ఇదే రేంజ్ లో ఉంది.
బాలయ్య కెరీర్ లో ఇప్పటి వరకు దక్కని అడ్వాన్స్ బుకింగ్స్ మరియు ఇప్పటి వరకు ఆయన కెరీర్ లో చూడని ఓవర్సీస్ వసూళ్లు ఈ సినిమా తో నమోదు అవ్వబోతున్నాయి అంటూ అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు.ఈ మొత్తం వ్యవహారం చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవడమే కష్టంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అఖండ సినిమా తో బాలయ్య బోయపాటి లు హ్యాట్రిక్ ను దక్కించుకోబోతున్నారు.
ప్రతి ఒక్క సందర్బంలో కూడా అఖండ సినిమా భారీ విజయాన్ని దక్కించుకోవడంతో పాటు వసూళ్లు భారీగా దక్కించుకుంటుందనే నమ్మకంను బోయపాటి వ్యక్తం చేస్తు వచ్చాడు.కనుక ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకుని ఆయనకు మంచి విజయాన్ని కట్టబెడుతుందని అంతా అంటున్నారు.ఈ సినిమా లో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటించింది.
పూర్ణ కీలక పాత్రలో కనిపించబోతుంది.