టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ వయసు పెరిగే కొద్దీ సినిమాల వేగాన్ని పెంచుతున్నాడు.ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలోఅఖండసినిమా చేస్తున్నాడు.
బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు పీక్స్ లో ఉంటాయి.ఎందుకంటే ఇంతకు ముందు వీరి కాంబోలో సింహ, లెజెండ్ సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి.
ఆ సినిమాలు తర్వాత బాలయ్య మళ్ళీ సూపర్ హిట్ అందుకోలేక పోయాడు.అందుకే నందమూరి అభిమానులు వీరి కాంబో అంటే ఆసక్తి కనబరుస్తున్నారు.ఇప్పుడు అఖండ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదల అయ్యి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఈ టీజర్ చూసిన తర్వాత ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.
ఈ సినిమాలో బాలయ్య ఇంత వరకు చూడని సరికొత్త లుక్ లో కనిపించాడు.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సయేశా సైగల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండడంతో ఈ సినిమా పాటల విషయంలో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ ఈ సినిమా గురించిన ఏదొక వార్త బయటకు వస్తూనే ఉంది.అయితే తాజాగా ఈ సినిమా పై ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.తాజాగా వస్తున్న రూమర్ ప్రకారం ఈ సినిమాలో హిస్టారికల్ టచ్ కూడా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో పలు చారిత్రాత్మక ప్రాంతాలు కనిపించనున్నట్టు తెలుస్తుంది.అయితే ఇది పీరియాడిక్ వే లో అయితే ఉండదట.
చూడాలి మరి ఈ సినిమా విడుదల అయితే కానీ ఎన్ని విశేషాలు ఉన్నాయో తెలుస్తుంది.