టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా ప్రారంభం అయిన ఆకాశవాణి సినిమా ఆ సమయంలో చాలా ఆసక్తిని కలిగించింది.కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది.
ఆ తర్వాత షూటింగ్ ప్రారంభం అయ్యే సమయానికి నేను సినిమా నుండి తప్పుకుంటున్నట్లుగా కార్తికేయ ప్రకటించాడు.కార్తికేయ తప్పుకోవడంతో సినిమా ఉందా లేదా అనే అనుమానాలు చాలా మంది వ్యక్తం చేశారు.
కాని సినిమా చిత్రీకరణ కోసం మేకర్స్ గట్టిగా ప్రయత్నించి ఎట్టకేలకు షూటింగ్ ను ముగించారు.చిత్రీకరణ ముగియడంతో విడుదలకు సిద్దం చేస్తున్నట్లుగా ఆమద్య ప్రకటించారు.
సినిమా చిత్రీకరణ పూర్తి అయిన నేపథ్యంలో విడుదల విషయంలో పుకార్లు షికార్లు చేయడం మొదలు అయ్యింది.
మొదట ఈ సినిమా ను ఓటీటీ లో విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.గత ఏడాది స్పష్టంగా ఈ సినిమా ను థియేటర్లలోనే విడుదల చేస్తాం అంటూ హామీ ఇచ్చారు.థియేటర్ల ద్వారా మాత్రమే ఈ సినిమా మీకు ఎంటర్ టైన్ మెంట్ ను ఇస్తుందనే హామీని మేకర్స్ ఇచ్చారు.
ఇప్పుడు ఆ హామీ మేరకే సినిమా విడుదల కు సిద్దంగా ఉన్నా కూడా థియేటర్లు లేక పోవడం వల్ల విడుదల వాయిదా వేస్తున్నారు.పెద్ద మొత్తం లో ఖర్చు చేసి ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో పీరియాడిక్ డ్రామా గా రూపొందించిన ఈ సినిమా తప్పకుండా మరో లెవల్ లో ఉంటుందని ఇటీవల విడుదల అయిన టీజర్ ను బట్టి అర్థం అవుతుంది.
ఎక్కువ శాతం కొత్త వారు ఉన్న ఈ సినిమా చాలా విభిన్నంగా అనిపిస్తుంది.అందుకే థియేటర్ లోనే చూస్తే బాగుంటుందని అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమాను ఇదే ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.