పూరి ఆకాష్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా రూపొందిన రొమాంటిక్ సినిమా మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.సినిమా చిత్రీకరణ కరోనా వల్ల ఆలస్యం అయినా కూడా విడుదల సమయంకు విజయ్ దేవరకొండ మరియు ప్రభాస్ ల వల్ల భారీ స్థాయిలో క్రేజ్ దక్కింది.
ఈ సినిమా చిత్రీకరణ సమయంలో పెద్దగా ఆసక్తి లేదు కాని అనూహ్యంగా ఇప్పుడు అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ను పూరి నిర్మించాడు.
ఛార్మి మరియు పూరి ఈ సినిమా ను కలిసి నిర్మించిన విషయం తెల్సిందే.ఈ సినిమా కోసం పూరి కథను అందించడంతో పాటు స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ ఆయనే చూసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.
రొమాంటిక్ మొత్తం బాధ్యతలు తానే చూసుకున్నాడు.
తాజాగా ఈ సినిమా ప్రీమియర్ ను సెలబ్రెటీల కోసం వేయడం జరిగింది.
సినిమా చూసిన తర్వాత సాదారణంగా బాగుందనే సెలబ్రెటీలు అంటూ ఉంటారు.అయితే ఈ సినిమా రియల్ రివ్యూ ఏంటీ అనేది తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
చాలా మంది ఈసినిమా గురించి మీడియా ముందు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు.కాని సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమా గురించి ఆహా ఓహో అన్నట్లుగా పేర్కొనలేదు.
సినిమా విడుదలకు ముందు అలాంటి రివ్యూలు పెట్టడం కరెక్ట్ కాదు.కనుక ఈ రివ్యూలు ఎందుకు అనే ఉద్దేశ్యంతో వారు ట్వీట్స్ చేయలేదు అంటున్నారు.కాని వారి ఫీలింగ్ మాత్రం ఈ సినిమా పూరి ఆకాష్ కు మంచి సినిమా గా నిలుస్తుందని అంటున్నారు.పూరి ఆకాష్ ముందు ముందు మంచి సినిమా లు చేసేందుకు ఇది ఖచ్చితంగా పునాదిలా ఉంటుందని ఈ సందర్బంగా వారు అన్నారట.
ఖచ్చితంగా ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.