డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడుగా టాలీవుడ్ లోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆకాష్ పూరి ఎంట్రీ ఇచ్చాడు.తరువాత ఆంధ్రాపోరీ అనే రీమేక్ మూవీతో హీరోగా టర్న్ తీసుకున్నాడు.
అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.కొంత గ్యాప్ ఇచ్చి పూరీ జగన్నాథ్ కొడుకుని కమర్షియల్ హీరోగా నిలబెట్టే బాద్యత తీసుకొని అతనిని హీరోగా పెట్టి మెహబూబా అనే లవ్ స్టొరీని ఆవిష్కరించారు.
ఈ సినిమాలో ఇండియన్ సోల్జర్ గా ఆకాష్ పూరి నటించాడు.అయితే మూవీ డిజాస్టర్ అయ్యింది.
దీంతో తన ఆలోచన, మేకింగ్ విజన్ అంతా స్టార్ హీరోల పాయింట్ అఫ్ వ్యూలో ఉండటంతో ఆకాష్ పూరి నెక్స్ట్ సినిమా దర్శకత్వ బాద్యతని తన అసోసియేట్ అనిల్ కి అప్పగించి అతను అందించిన కథతోనే రొమాంటిక్ అనే మూవీని తెరకెక్కించారు.
ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయినా కూడా ఎందుకనో రిలీజ్ పై పూరీ పెద్దగా దృష్టి పెట్టలేదు.
అలాగే ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వడం లేదు.పూరీ జగన్నాథ్ ఆలోచన అంతా విజయ్ దేవరకొండతో చేస్తున్న పాన్ ఇండియా మూవీపైనే ఉంది.
అయితే ఆకాష్ పూరి రొమాంటిక్ మూవీకి నెట్ ఫ్లిక్స్ నుంచి అదిరిపోయే ఆఫర్ రావడంతో ఒటీటీ రిలీజ్ చేయడానికి పూరీ జగన్నాథ్ మొగ్గు చూపించినట్లు తెలుస్తుంది.ఇప్పటికే వారితో ఒప్పందం కూడా అయిపోయిందని టాక్.
త్వరలో దీనిపై అఫీషియల్ ఎనౌన్స్ కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఆకాష్ పూరి మాత్రం రొమాంటిక్ రిలీజ్ గురించి పట్టించుకోకుండా తన నెక్స్ట్ సినిమాని బయట బ్యానర్ లో గత ఏడాది స్టార్ట్ చేశాడు.
దళం, జార్జ్ రెడ్డి ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది.