ఇండస్ట్రీలో హీరోగా రాణించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది.కానీ కొంతమందికి మాత్రమే ఆ కల నెరవేరుతోంది.
అయితే ఇటీవలి కాలంలో ఇక స్టార్ కిడ్స్ హీరో లుగా పరిచయం కావడం ఎంతో సులభం గా మారిపోతుంది అని చెప్పాలి.కానీ నేటి రోజుల్లో ప్రేక్షకుల పంతా మారిపోయింది.
భారీ బ్యాక్ గ్రౌండ్ లో సినిమా హీరోగా ఇండస్ట్రీలో పరిచయమైన ఆ సినిమాలు బాగుంటేనే ప్రేక్షకులు ఆదరించడం చేస్తూ ఉన్నారు.ఈ క్రమంలోనే కథలు ఎంపిక లో తడబడుతూ ఎంతోమంది స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారు ఇప్పటికీ నిలదొక్కుకోలేక పోతున్నారు అని చెప్పాలి.
ఇలాగే అల్లు వారి ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ప్రస్తుతం ఐకానిక్ స్టార్ గా టాప్ హీరోగా కొనసాగుతూ ఉండగా అదే బ్యాక్ గ్రౌండ్ లో అదే సపోర్టుతో ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ మాత్రం నిలబెట్టుకోలేక పరిశ్రమలో కనుమరుగయ్యారు ఇక ఇప్పుడు మరో ఇద్దరు స్టార్ కి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది.అయితే ఏకంగా పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి ఏకంగా అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ ను వెనక్కి నెట్టేశాడు అన్నది అర్ధమవుతుంది.
ఇంతకీ వెనక్కి నెట్టింది ఎందులో అనుకుంటున్నారు.ఫ్లాప్ సినిమాల విషయంలో వెనక్కు నెట్టాడు.
అక్కినేని అనే భారీ బ్యాక్ గ్రౌండ్ లో హీరో గా పరిచయమయ్యాడు అఖిల్.
తన పేరును సినిమా టైటిల్గా పెట్టుకొని ప్రేక్షకుల ముందుకొచ్చాడు.భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమా ఫ్లాప్ అయ్యింది.ఇక ఆ తర్వాత హలో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఇక ఈ సినిమా కూడా హిట్ కొట్టలేదు.ఇక ఆ తర్వాత మిస్టర్ మజ్ను అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా చివరికి ఈ సినిమాకు కూడా ఆదరణ కరువైంది అని చెప్పాలి.
వరుసగా మూడు ఫ్లాపుల తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ కొట్టాడు.ఆకాష్ పూరి 2015 లో ఆంధ్ర పోరి, 2018 మెహబూబా, 2021లో రొమాంటిక్, 2022 చోర్ బజార్.
ఈ నాలుగు సినిమాలు స్లాపు గానే మిగిలిపోయాయ్.ఇలా ఫ్లాపుల్లో అఖిల్ ను వెనక్కి నాట్టాడు ఆకాష్ పూరి.