మధుబాబు ఫేమస్ ఫిక్షన్ నవల సిరీస్ అయిన షాడోని ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.దీనికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది.
రచయిత మధుబాబు మరోసారి ఈ ఫిక్షన్ వెబ్ సిరీస్ కోసం తన నవలలపై వర్క్ చేస్తున్నారు.ఇక వీలైనంత త్వరగా ఈ వెబ్ సిరీస్ హిందీతో పాటు సౌత్ భాషలలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.
దానికోసం ఓ వైపు దర్శకుడుని కూడా వెతికే పనిలో నిర్మాతలు ఉన్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ షాడో వెబ్ సిరీస్ గురించి మరో ఆసక్తికరమైన వార్త బయటకి వినిపిస్తుంది.
ఇందులో హీరో పాత్రని ఇంకా ఎంపిక చేయకుండానే మిలిగిన పాత్రల ఎంపికపై దృష్టి పెట్టారని టాక్ నడుస్తుంది.షాడో నవలలో కీలక పాత్రల కోసం రానా, అల్లరి నరేష్ ని సంప్రదించడం జరిగిందని చెప్పుకుంటున్నారు.
వాళ్ళు కూడా ఈ నవల వెబ్ సిరీస్ మీద ఆసక్తిగానే ఉన్నారని వినిపిస్తుంది.అయితే అఫీషియల్ గా ఇంకా వారి నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదని తెలుస్తుంది.
వచ్చిన వెంటనే ఇంకా ఈ వెబ్ సిరీస్ కి గోపిచంద్ లేదంటే అలాంటి మాస్ ఎలివేషన్ ఉన్న హీరోని తీసుకోవాలని చూస్తున్నట్లు బోగట్టా.