ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది.దీంతో బుల్లితెర సెలబ్రిటీలతోపాటు వెండితెర సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు చెరువుగా ఉంటున్నారు.
అంతేకాకుండా సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో అభిమానులకు అలాగే సెలబ్రిటిలకు మధ్య వ్యత్యాసం చాలావరకు తగ్గిపోయింది.దీంతో సెలబ్రిటీలు వారి అభిమానులతో వారికి సంబంధించిన విషయాలను ఫోటోలను పంచుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.
కాగా పలువురు హీరోయిన్లు సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు చేరువుగా ఉంటున్నారు.
ఇప్పటికే పలువురు స్టార్ హీరోల భార్యలు సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే.
తాజాగా మరొక స్టార్ హీరో భార్య కూడా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది.అయితే ఎంట్రీ ఇవ్వడంతోనే ఆమె దాదాపుగా 50 వేలకు మందికి పైగా ఫాలోవర్స్ ని సంపాదించుకుంది.
ఆమె మరెవరో కాదు నటి షాలిని. మూడేళ్ల వయసులోనే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన నటనను మొదలుపెట్టింది షాలిని.
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది.సఖి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది ఈ ముద్దుగుమ్మ.
కాగా షాలిని హాలీవుడ్ స్టార్ హీరో అయిన అజిత్ కుమార్ ను పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.
పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బాయ్ చెప్పేసిన షాలిని ఎక్కువగా కుటుంబానికి ప్రాధాన్యతను ఇస్తూ సోషల్ మీడియాకు కూడా దూరమయింది.ఇది ఇలా ఉంటే తాజాగా షాలిని మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది.అభిమానులకు చిరుగా ఉండడం కోసం ఆమె తాజాగా ఒక మంచి నిర్ణయం తీసుకొని సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేసింది.shaliniajithkumar2022 ఐడీతో ఇన్స్టాగ్రామ్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఈ నేపథ్యంలోనే తన భర్త అజిత్ తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆ ఫోటోలు పెట్టడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.కాగా షాలిని అలా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో అప్పుడే షాలినిని 50వేల మంది ఫాలో అవుతున్నారు.
ఆ సంఖ్య సోషల్ మీడియాలో అంతకంతకు పెరుగుతూనే ఉంది.