మహారాష్ట్ర రాజకీయం రసవత్తరంగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించే విధంగా సాగింది.మెజార్టీ సీట్లు వచ్చినా కూడా మ్యాజిక్ ఫిగర్ను బీజేపీ చేరుకోలేక పోవడంతో ప్రభుత్వంను ఏర్పాటు చేయలేక పోతుంది.
ఎన్సీపీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించి పడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.ఆయనతో పాటు ఎన్సీపీ నేత అజిత్ పవార్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు.
కాని ఎన్సీపీ నేతలు ఎవరు కూడా ఆయనతో కలిసి వెళ్లేందుకు ఆసక్తి చూపించలేదు.
దాంతో డిప్యూటీ సీఎంగా మూడు రోజులు ఉన్న అజిత్ పవార్ రాజీనామా చేశాడు.
అజిత్ పవార్ రాజీనామా చేసి మళ్లీ ఎన్సీపీలోకి వెళ్లాడు.ఎన్సీపీకి కూటమి ఒప్పందంలో భాగంగా ఒక డిప్యూటీ సీఎం పదవి దక్కబోతుంది.
ఆ డిప్యూటీ సీఎం పదవిని అజిత్ పవార్కు ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.డిప్యూటీ సీఎంగా రేపు మరోసారి అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు.
అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.కేవలం వారం గ్యాప్లోనే రెండు సార్లు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నందుకు గాను అజిత్ పవార్కు అరుదైన రికార్డు దక్కింది.