2023 సంక్రాంతి పండుగ పోటీ మామూలుగా లేదనే సంగతి తెలిసిందే.ఇప్పటికే సంక్రాంతికి మూడు సినిమాలు ఫిక్స్ కావడంతో వాటికి థియేటర్లను కేటాయించడం తలనొప్పిగా మారింది.తెలుగు రాష్ట్రాల్లో వారసుడు మూవీకి ఎక్కువ సంఖ్యలో థియేటర్లను కేటాయించడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.50 కోట్ల రూపాయల రేంజ్ లో ఈ సినిమాకు బిజినెస్ జరిగిందంటే దిల్ రాజు ఈ సినిమాపై ఏ స్థాయిలో దృష్టి పెట్టారో అర్థమవుతుంది.
అయితే ఈ మూడు సినిమాల మధ్యే సంక్రాంతి పోటీ ఉంటుందని అందరూ భావించగా ఊహించని విధంగా ఈ జాబితాలోకి అజిత్ మూవీ ఎంట్రీ ఇచ్చింది.రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ నిర్వాహకులు ఈ సినిమా థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేశారని సమాచారం.
ఏకంగా మూడు కోట్ల రూపాయలకు ఈ సినిమా థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.అయితే ఈ సినిమాకు థియేటర్ల సమస్య ఎదురయ్యే ఛాన్స్ ఉంది.
ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 100 కంటే ఎక్కువ థియేటర్లు దొరకడం కష్టమని ప్రధాన నగరాలు, పట్టణాలలో మాత్రమే ఈ సినిమాక్ థియేటర్లు దక్కే అవకాశం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.తమిళంలో తునివు టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా తెలుగు టైటిల్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.
అయితే పాజిటివ్ టాక్ వస్తే మాత్రం నిర్మాతలకు బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు.
సంక్రాంతి సినిమాల రేసులో తునివు మూవీ కూడా చేరడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఈ సినిమాలు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించడం తేలిక కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సంక్రాంతి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటాయో లేదో చూడాల్సి ఉంది.
సంక్రాంతి సినిమాలపై బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తాలను పెట్టుబడులుగా పెట్టారు.అజిత్ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.