ప్రముఖ దక్షిణాది నటుడు అజిత్ కుమార్ గురించి అందరికీ తెలిసిందే.ఆయన నటనతో ఎంతో పేరు తెచ్చుకొని తమిళంలో మంచి హీరోగా గుర్తింపు పొందారు.
ఈయనకు దక్షిణాది సినీ పరిశ్రమలో ఉన్న అభిమానులు అంతా ఇంతా కాదు.ఈయన మొదటిసారిగా 1992లో ప్రేమ పుస్తకం అనే సినిమాలో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు.
ఈయన 2000 సంవత్సరంలో ఒకప్పటి టాప్ హీరోయిన్ షాలిని ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఇక ఈయన సోషల్ మీడియాలో కూడా ముందుంటాడు.
ప్రస్తుతం అజిత్ హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘వలిమై’ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాకు నీరవ్ షా సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు.ఇక నదిలో కార్తికేయ గుమ్మకొండ, హ్యూమా ఖురేషి, యోగి బాబు లు నటిస్తున్నారు.
అయితే ఈ సినిమా పట్ల అజిత్ కాస్త అసంతృప్తి చెందిన వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా గురించి సినీ బృందం కానీ, నటుడు అజిత్ కానీ ఎటు వంటి విషయాలను బయటకు ప్రకటించలేదు.దీంతో అజిత్ అభిమానులు ఈ సినిమా గురించి ఎటువంటి అప్ డేట్ లను వెల్లడించలేదని ఒత్తిడి చేస్తున్నారట.మరి కొంత మంది అభిమానులు ఏకంగా గోడలపై వాల్ పోస్టర్ లనే ముద్రించిన వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ప్రతిరోజు చర్చలు జరుగుతూనే ఉన్నాయట.ఇక దీని గురించి అజిత్ స్పందించగా.తీవ్ర అసంతృప్తికి దారి తీస్తున్నారని ఇటీవల ఓ పత్రిక ప్రకటనను కూడా విడుదల చేశారట.కొన్ని రోజుల నుండి తను నటిస్తున్న ‘వలిమై’ సినిమా గురించి అప్ డేట్ లను తెలపాలని అభిమానులు తీవ్రంగా వెల్లడించాలని తెలుపగా అజిత్ మనోవేదనకు గురయ్యాడట.
ఇది వరకే ఈ సినిమా గురించి కొన్ని విషయాలు ప్రకటించగా త్వరలోనే సందర్భం చూసుకుని దర్శక నిర్మాతలతో చర్చించి తెలుపుతానని, అప్పటి వరకు ఎటువంటి గొడవలు చేయొద్దని తెలిపారట.మనం ఉండే దాన్ని బట్టి మన మర్యాద పెరుగుతుందని, ఈ విషయం గురించి తన అభిమానులను సమాజంలో, సోషల్ మీడియాలో బాధ్యతగా ఉండాలని తెలిపారట.