కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కరోనాతో పోరాడుతున్న వారికి సహాయం చేసే రీతిలో తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కి 25 లక్షల రూపాయల భారీ విరాళం ప్రకటించారు.నేరుగా బ్యాంకు ద్వారా తమిళనాడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కి బదిలీ చేయడం జరిగింది.
తమిళ సినిమా రంగంలో ఒక అజిత్ మాత్రమే కాక అంతకుముందు
సూర్య బ్రదర్స్
అదేవిధంగా ఏఆర్ మురుగదాస్ ఇంకా స్టాలిన్ కొడుకు ఉదయనిది తో పాటు ఇంకా చాలా మంది నటీనటులు తమిళనాడు రాష్ట్రంలో కరోనా రోగులను కాపాడటానికి ప్రభుత్వానికి అండగా నిలబడుతున్నారు.
ఇటీవలె స్టాలిన్ ముఖ్యమంత్రి కావటంతో చాలామంది నటీనటులు వ్యక్తిగతంగా ఆయన్ని కలుసుకుని మరి అభినందిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెక్కులు అందిస్తున్నారు.
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా దాదాపు కోటి రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది.తమిళనాడు రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాక రెండు వారాల పాటు పూర్తి లాక్ డౌన్ విధించటం తెలిసిందే.
ఏది ఏమైనా ప్రజలను కాపాడటం కోసం రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దేశంలో చాలామంది సెలబ్రిటీలు ముందుకు రావటం విశేషం.
.