ప్రస్తుతం మళ్లీ మొదలైన కరోనా విజృంభన మరింత తీవ్రంగా మారింది.రోజు రోజుకు ఎక్కువ సంఖ్యలో కేసులు పెరుగుతున్న తరుణంలో మరింత భయందోళన ఎక్కువవుతుంది.
ఇక ప్రజలంతా పలు జాగ్రత్తలతో ఉండగా ఏదో ఒక చోట నుండి వైరస్ తాకిడి ఎదురవుతుంది.ఇదిలా ఉంటే ఇప్పటికే పలువురు సినీ ఇండస్ట్రీ వాళ్లకు కరోనా సోకగా.
ఇటీవలే డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఎన్టీఆర్ విలన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది.
బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలలో విలన్ పాత్రలో నటించిన నటుడు ఎజాజ్ ఖాన్.
రక్త చరిత్ర, టెంపర్ పలు చిత్రాలలో విలన్ గా నటించిన విషయం తెలిసిందే.ఇక ఇటీవలే డ్రగ్ డీలర్ షాదాబ్ బటాటా అరెస్టు అవ్వగా మరోసారి ఎజాజ్ పేరు బయటపడింది.
షాదాబ్ కుమారుడు ఫరూక్ నుంచి దాదాపు రెండు కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నాడని తేలగా, దీంతో ఆయన మళ్ళీ డ్రగ్స్ విషయంలో సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది.ఇక ఇతనిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేయగా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
కానీ తాజాగా ఎజాజ్ కు కరోనా వైరస్ పరీక్షలు చేయించగా పాజిటివ్ అని తేలింది.ఇక అతనిని హాస్పిటల్ లో చేర్చగా.ఎన్సీబీ బృందంలో భయం ఆందోళన మొదలైంది.అతనితో ఉన్న అధికారులంతా పరీక్షలు చేయించుకొని క్వారంటైన్ లోకి వెళ్లినట్టు తెలిసింది.ఇక ఎజాజ్ అరెస్టుకు ముందు అతని ఇంట్లో ఎన్సీబీ అధికారులు నవి ముంబై, జోగేశ్వరి ప్రాంతంలో మెరుపు దాడులు చేశారు.ఇక ఆ సమయంలో ఆయన వెంట ఉన్న విదేశీ మహిళ తప్పించుకో గా ఆమె కోసం అధికారులు గాలింపు చేస్తున్నారు