“Rx100” సినిమాతో మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న దర్శకుడు అజయ్ భూపతి.ఈయన తన రెండవ సినిమా కోసం సంవత్సర కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
మహాసముద్రం అనే టైటిల్ పట్టుకుని ఎప్పటినుండో చర్చలు జరుపుతున్నారు.మొదట ఈ సినిమాలో హీరోగా నాగ చైతన్య నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
ఆతర్వాత పలువురి హీరోల పేర్లు వచ్చాయి.చివరకు మాస్ రాజా పెరు కన్ఫర్మ్ అయ్యింది.
సినిమా మొదలు పెట్ట బోతున్నాట్లుగా వార్తలు వస్తున్న సమయంలో అనూహ్యంగా మళ్ళీ హీరో మారాడు అంటూ ప్రచారం జరుగుతోంది.రవి తేజ విషయంలో జరుగుతున్న ప్రచారం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.రవి తేజ బదులు మహాసముద్రంలో నాగ చైతన్య నటించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.నిన్న మొన్నటి వరకు డిస్కో రాజా పూరి అయిన వెంటనే మహాసముద్రంలో రవి తేజ దుకేస్తాడనుకుంటే ఇప్పుడేమో మార్పు గురించి ప్రచారం జరుగుతోంది.
నాగచైతన్య ప్రస్తుతం వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నారు.ఆ సినిమా పూర్తి అయిన తర్వాత మరో సినిమాకు కటిమిట్ అయ్యాడు.దానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వచించనున్నాడు.మరి ఇలాంటి సమయంలో మహా సముద్రంపై చైతు ఆసక్తి చూపినా లేదా అనేది చూడాలి.మహాసముద్రం విషయంలో వస్తున్న ఈ వార్తలు పుకార్లు అంటూ కూడా ప్రచారం జరుగుతోంది.అసలు విషయం ఏంటి అనేది అజయ్ భూపతి మాట్లాడితే కానీ క్లారిటీ రాదు.