ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఓ వివాహితుడు మినార్ బాలికను పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి గర్భవతిని చేసిన ఘటన సంచలనం రేపింది.వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లాలోని అల్లూరుకి చెందిన అజయ్ కుమార్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో ఓ మైనర్ బాలికను లోగదీసుకున్నాడు.
ఆ తర్వాత ఆ బాలిక గర్భం దాల్చింది.ఐతి చిన్న వయసులోనే గర్భం దాల్చిన కారణంగా బాలికకు అబార్షన్ అయ్యింది.
అంతేగాక బాలికకు అబార్షన్ అయినప్పటినుంచి తీవ్ర అనారోగ్యానికి గురవుతూ ఉండేది.
దీంతో బాలిక తల్లిదండ్రులు తను గర్భవతి అవ్వడానికి కారణం ఎవరని ఆరా తీయగా ఆ బాలిక అజయ్ పేరు చెప్పింది.
విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు అజయ్ కుమార్ గురించి ఆరా తీయగా అతడికి అప్పటికే వేరే యువతితో పెళ్లి అయినట్లు, అలాగే అజేయ్ కి ఒక చిన్న పాప కూడా ఉందని తెల్సుకున్నారు.
దీంతో బాలిక తల్లదండ్రులు దగ్గర్లోని పోలీసులకి ఫిర్యాదు చేయగా నిందుతుడు అజయ్ కుమార్ ని కావలి పోలీసులు అరెస్ట్ చేశారు.అలాగే అజయ్ కుమార్ పై మైనర్ బాలికను గర్భవతిని చేసినందుకు గానూ ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
.