తమిళ హీరో కార్తీ నటించిన పూర్తి క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఖైదీ ఎలాంటి సక్సెస్ను అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ బ్లాక్బస్టర్ హిట్ మూవీగా నిలిచింది.
ఇక ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.కాగా ఈ సినిమా అందుకున్న సక్సెస్తో ఇప్పుడు ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేస్తున్నారు.
ఇప్పటికే బాలీవుడ్లో హీరో అజయ్ దేవ్గన్ ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు.
కాగా ఈ సినిమా షూటింగ్ను నవంబర్ నుండి మొదలుపెట్టాలని అజయ్ దేవ్గన్ భావిస్తు్న్నాడు.
ఈ క్రమంలో కేవలం సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేయాలని ఆయన చూస్తున్నాడు.ఎలాంటి గ్యాప్ లేకుండా ఈ సినిమా షూటింగ్ను ముగించాలని, దీని కోసం ఇప్పటికే సెట్స్ కూడా వేసినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాను 2021 ఫిబ్రవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు అజయ్ దేవ్గన్ తెలపడంతో, ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ సినిమాను అనుకున్న సమయానికే రిలీజ్ చేయాలని ఆయన చూస్తున్నాడు.
ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కించి అంతే భారీ హిట్ చేయాలని ఆయన చూస్తున్నాడు.
ఇక ఈ సినిమా సౌత్లో సాధించిన సక్సెస్తో ఆయన ఈ సినిమా బాలీవుడ్లోనూ అదిరిపోయే సక్సెస్ అందుకుంటుందని ఆశిస్తున్నారు.మరి ఈ సినిమాను అక్కడ ఎవరు డైరెక్ట్ చేస్తున్నారా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.