యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.కాగా ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటోన్న రాధేశ్యామ్ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని ప్రభాస్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను లైన్లో పెడుతున్నాడు.ఇప్పటికే నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీని ఓకే చేసిన ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో ఆదిపురుష్ అనే సినిమాలో నటించనున్నాడు.
ఈ సినిమాను ఇప్పటికే అఫీషియల్గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, త్వరలో ఈ సినిమా షూటింగ్ను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు.ఇక ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కుతుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
అయితే ఈ సినిమాలో శివుడి పాత్రలో బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్ నటిస్తాడని చిత్ర వర్గాలు అంటున్నాయి.గతంలో ఓం రౌత్ తెరకెక్కించిన ‘తాన్హాజీ’ చిత్రంలో అజయ్ దేవ్గన్ నటించడంతో, ఇప్పుడు మరోసారి ఆయన్ను తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అయితే ఈ సినిమాలో తాను నటించడం లేదని, ఆయన ఈ సినిమాలో నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు కేవలం పుకార్లేనని ఆయన తేల్చేశాడు.
మరి ఈ సినిమాలో శివుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారా అనే అంశం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా, ఈ సినిమాలో సీత పాత్రలో ఎవరు నటిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో టీ-సిరీస్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.
మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.