ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్.అక్కడ వరుస హిట్స్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు క్రియేట్ చేసుకున్న అజయ్ దేవగన్ కి యాక్షన్ హీరోగా మంచి పేరు ఉంది.
ఎలాంటి పాత్ర ఇచ్చిన ఈజీగా చేసే ఈ స్టార్ హీరో ప్రస్తుతం ఇండియన్ సూపర్ మెన్ గా మారబోతున్నాడని తెలుస్తుంది. హాలీవుడ్ లో ఇప్పటికే చాలా సూపర్ మెన్ మూవీస్ వచ్చాయి.
అయితే ఇండియన్ సూపర్ మెన్ అంటే ఇప్పటి వరకు అందరూ క్రిష్ సిరీస్ ని చూస్తారు.అయితే ఇప్పుడు బాలీవుడ్ లో మరో సూపర్ మెన్ సిరీస్ కి ప్లానింగ్ జరుగుతుంది.
అందులో టైటిల్ రోల్ ని అజయ్ దేవగన్ పోషిస్తాడని తెలుస్తుంది.ఈ సూపర్ మెన్ సిరీస్ లో ఫస్ట్ మూవీ సక్సెస్ బట్టి వరుసగా సీక్వెల్స్ ప్లాన్ చేసే ఆలోచన జరుగుతుంది.
యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఈ సూపర్ మెన్ సిరీస్ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది.ఈ సంస్థ సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ భారీ బడ్జెట్ సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
యష్ రాజ్ ఫిలిమ్స్ అంటే ఇప్పటి వరకు ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు గా మాత్రమే కనిపించేవి.ఈ సినిమాతో తమ స్టాండర్డ్ పెంచుకోవాలని ఆ సంస్థ ఈ భారీ పాన్ ఇండియా సిరీస్ కి వర్క్ అవుట్ చేస్తుంది.
ఈ సినిమాకు కొత్త దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నాడు.ఈ కరోనా సమయంలో స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.