'మహాసముద్రం' వార్తలపై ఫుల్‌ క్లారిటీ.. అక్కినేని ఫ్యాన్స్‌ నిరుత్సాహం

‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో దర్శకుడిగా ఒక్కసారిగా మంచి గుర్తింపు దక్కించుకున్న దర్శకుడు అజయ్‌ భూపతి.ఈయన రామ్‌ గోపాల్‌ వర్మ శిష్యుడు అనే విషయం అందరికి తెల్సిందే.

 Ajay Bhupathi Responds On Maha Samudram Rumors-TeluguStop.com

ఈయన రెండవ సినిమాకు సంబంధించి మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.ఈయన రెండవ సినిమాగా మహాసముద్రం అనే టైటిల్‌తో చేయబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది.

అందుకు సంబంధించిన వార్తలు కూడా తెగ వచ్చాయి.బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా నటించబోతున్నాడు, సమంతను హీరోయిన్‌ పాత్రకు ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి.

కొన్ని రోజుల నుండి నాగచైతన్య మరియు సమంతలు ఈ చిత్రంలో నటిస్తారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి

‘మజిలీ’ చిత్రం తర్వాత నాగచైతన్య మరియు సమంతల జంటకు ఎంత క్రేజ్‌ ఉందో అర్థం అయ్యింది.అందుకే వెంటనే వారిద్దరి కాంబోలో మూవీని పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.

అందుకే అజయ్‌ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం సినిమాను చేసేందుకు అక్కినేని జంట ఓకే చెప్పిందని తెలుస్తోంది.అయితే తాజాగా ఆ విషయంపై దర్శకుడు అజయ్‌ భూపతి స్పందిస్తూ అవన్ని ఒట్టి పుకార్లే అంటూ క్లారిటీ ఇచ్చాడు.

గత కొంత కాలంగా మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని, తాను ఇంకా రెండవ సినిమాకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.త్వరలోనే రెండవ సినిమాకు సంబంధించి ఒక నిర్ణయానికి రావాలని కోరుకుంటున్నాను.

అయితే ఆ నిర్ణయం ఎలా ఉంటుందనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.రెండవ సినిమా విషయంలో అజయ్‌ భూపతి నిర్ణయం ఏంటీ అనే విషయమై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది.

అజయ్‌ భూపతి ప్రకటన అక్కినేని ఫ్యాన్స్‌కు కాస్త నిరుత్సాహం కలిగించేలా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube