దర్శక దిగ్గజం రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.సినిమా షూటింగ్ ఎలాంటి గ్యాప్ లేకుండా పూర్తి చేయాలని అనుకుంటున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ కి సంబంధించి కీలక సన్నివేశాలని తెరకెక్కించారు.ఇకపై అలియా భట్ రామ్ చరణ్ కాంబినేషన్ లో సన్నివేశాలు తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది.
భారీ బడ్జెట్ తో, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నటుల కలయికలో భారీ మల్టీ స్టారర్ చిత్రంగా రాజమౌళి దీనిని తెరపై ఆవిష్కరిస్తున్నారు.ఇదిలా ఉంటే హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ ఈ సినిమాలో తారక్ కి జోడీగా ఇంగ్లీష్ యువరాణి పాత్రలో కనిపించబోతుంది.
అలాగే ఇందులో రే స్టీవెన్ సన్, అల్సన్ డూడి కీలక పాత్రలలో నటిస్తున్నారు.అలాగే బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్, అలియా భట్ కీలక పాత్రలు చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకి ఆర్టిస్ట్ లు పాన్ ఇంటర్నేషనల్ ఫ్లేవర్ ని జక్కన్న ఇచ్చేశాడు.
ఇదిలా ఉంటే ఈ భారీ ప్రాజెక్ట్ లో తెలుగమ్మాయి, తమిళ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా అవకాశం సొంతం చేసుకుందనే టాక్ వినిపిస్తుంది.
ఈ ప్రాజెక్ట్ లో ఐశ్వర్య నటిస్తే కచ్చితంగా అది ఆమెకి ప్లస్ అవుతుంది.తమిళంలో స్టార్ హీరోయిన్ గా, ఎక్కువ ఫీమేల్ సెంట్రిక్ కథలతో దూసుకుపోతూ ఇప్పుడిప్పుడే తెలుగులో కూడా అవకాశాలు దక్కించుకుంటున్న ఐశ్వర్య రాజేష్ ని ఆర్ఆర్ఆర్ లో ఓ గిరిజన యువతి పాత్ర కోసం రాజమౌళి తీసుకున్నట్లు తెలుస్తుంది.
కొమురం భీమ్ ని ప్రేమించే గిరిజన అమ్మాయిగా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తుందని సమాచారం.ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ లో త్వరలో ఆమె కూడా జాయిన్ అవుతుందని తెలుస్తుంది.
అయితే ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఆమె నటిస్తున్నట్లు అధికారిక కన్ఫర్మేషన్ లేదు.
.