టాలీవుడ్లో తనదైన సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న యంగ్ హీరో శర్వానంద్, గతకొంత కాలంగా సరైన సక్సెస్ లేకపోవడంతో ఎలాగైనా అదిరిపోయే హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.ఈ క్రమంలోనే ఆర్ఎక్స్ 100 చిత్రంతో అదిరిపోయే సక్సెస్ను అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్లో ‘మహాసముద్రం’ అనే సినిమాను తెరకెక్కించేందుకు శర్వా రెడీ అవుతున్నాడు.
ఇప్పటికే స్క్రిప్టు పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా, త్వరలోనే పట్టాలెక్కేందుకు రెడీ అవుతోంది.
ఈ క్రమంలో ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరిని తీసుకుంటారా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
కాగా ఈ సినిమాలో అందాల భామ ఐశ్వర్యా రాజేష్ను హీరోయిన్గా తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చనిపోతుందని, అయితే ఆమె పాత్ర సినిమాకు చాలా కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
తన పాత్రకు ప్రాధాన్యత ఉండటంతో ఈ సినిమాలో నటించేందుకు ఐశ్వర్యా రాజేష్ కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇక దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమా కథను వివరించిన విధానం కూడా నచ్చడంతో ఆమె ఈ సినిమాలో నటించేందుకు ఓకే అన్నట్లు తెలుస్తోంది.
కాగా పూర్తి ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఇక ఈ సినిమాలో శర్వానంద్ పాత్ర గతంలో ఆయన నటించిన ‘ప్రస్థానం’ చిత్రంతో పోలి ఉంటుందని, సినిమాలో ఆయన పాత్ర చాలా సీరియస్గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
వైజాగ్ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రానుందని తెలుస్తోంది.ఇక ఈ సినిమాను కరోనా ప్రభావం ముగియగానే తెరకెక్కించి వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
మరి ఈ సినిమాతో శర్వానంద్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా, ఈ సినిమాతో ఐశ్వర్యా రాజేష్ మరోసారి ప్రేక్షకులను మెప్పించగలదా అనే అంశం తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.